ఎడ్ల పందాలలో అపశృతి.. ఆరుగురికి గాయాలు

59చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్ల పందాల పోటీలు వద్ద శుక్రవారం బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీష చౌదరి ఎడ్ల జత ఎడ్ల పందెంలో బరిలోకి దిగిన కొంతసేపటికి బెదిరి జనాలలోకి దూసుకొచ్చాయి. ఎడ్ల పందాలను వీక్షిస్తున్న వారిలో ఆరుగురికి గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్