గుంటూరులో విస్తృతంగా వాహనాల తనిఖీలు

78చూసినవారు
గుంటూరు రూరల్ ఏరియాలో శనివారం పోలీస్ శాఖ అధికారులు, రవాణ శాఖ అధికారులు సంయుక్తంగా నాకాబందీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, 4 డీఎస్పీలు, 8 మంది సీఐల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. ఈ నేపథ్యంలో ధృవపత్రాలు, సరిగ్గా లేని వాహనాలను, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను గుర్తించి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కి తరలించారు.

సంబంధిత పోస్ట్