లడ్డూపై ఉన్న ఆసక్తి.. విశాఖ ఉక్కుపై లేదు: జంగాల

52చూసినవారు
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ అఖిల భారత కార్మిక సంఘాల ఐక్యవేదిక బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. లడ్డూ పై ఉన్న ఆసక్తి విశాఖ ఉక్కు పై లేదని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఒకే పార్టీకి చెందిన నాయకులు వేరువేరుగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు.

సంబంధిత పోస్ట్