గుంటూరు నగరంలో 1. 25 లక్షల మందితో ప్రతిజ్ఞ

82చూసినవారు
గుంటూరు నగరంలో 1. 25 లక్షల మందితో ప్రతిజ్ఞ
గుంటూరు నగరంలో మంగళవారం 1. 25 లక్షల మందితో స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించినట్లు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికుల మస్చర్ పాయింట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, వార్డు సచివాలయాలతోపాటూ జీఎంసీ కార్యాలయంలో ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు అక్టోబర్ 2 వరకు జరగనున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను జయప్రదం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్