సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ సంతోష్ కుమార్

50చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ సంతోష్ కుమార్
విజయవాడలో వరద వల్ల నష్టపోయిన కాలనీలకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని టీడీపి ఆఫీసుకు శుక్రవారం సీపీఐ నాయకులు వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కలిసి సమస్యలను వివరించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ. ఈశ్వరయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్