రేపు గుంటూరులో ట్రాఫిక్ మళ్లింపు: ఎస్పీ

66చూసినవారు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సతీశ్ కుమార్ బుధవారం తెలిపారు. గుంటూరుకు మంత్రి నారా లోకేశ్ హాజరవుతున్నందున ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందన్నారు. గుజ్జనగుండ్ల వైపు వెళ్లేవారు నగరంపాలెం ఎస్బీఐ నుంచి చుట్టుగుంట మీదుగా వెళ్లాలని తెలిపారు. కలెక్టరేట్ వైపు వచ్చేవారు దర్గా వెనక నుంచి రావాలన్నారు

సంబంధిత పోస్ట్