భక్తులను దూరం చేయడానికి వైసీపీ ప్రయత్నించింది: రమేశ్ నాయుడు

58చూసినవారు
వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్వీర్యం చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. రమేశ్ నాయుడు విమర్శించారు. చంద్రమౌళీ నగర్ లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవ దేవుణ్ణి భక్తులకు దూరం చేయాలనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం నెయ్యికి బదులు జంతువుల కొవ్వును లడ్డూలో వినియోగించిందన్నారు. వైఎస్ఆర్ కూడా ఏడు కొండలను 2 కొండలు చేస్తానని చెప్పినట్లు గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్