పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు

54చూసినవారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు, పోలీసుల పై దాడి కేసులో అరెస్టయిన పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. రూ.50 వేల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్