పరిశ్రమలలో తనిఖీలు చేపట్టాలి

81చూసినవారు
పరిశ్రమలలో తనిఖీలు చేపట్టాలి
రాష్ట్రంలో అనేక పరిశ్రమలలో భద్రత లేకపోవడం వలన కార్మికుల జీవితాలు గాలిలో దీపంలా తయారయ్యాయని, ప్రభుత్వం వెంటనే సేఫ్టీ ఆడిట్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాచర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేశారు. అన్ని పరిశ్రమలలో తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, అలాగే యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్