నరసరావుపేటలో రైతుల ఆందోళన

60చూసినవారు
నరసరావుపేట మండలం రావిపాడు వద్ద రైతుల ఆందోళన చేపట్టారు. నకరికల్లు-చీరాల ఓడరేవు రోడ్డు కొలతలకు అధికారులు వచ్చారు. ప్రస్తుతం వేస్తున్న రోడ్డు వలన రావిపాడు, ఇస్సాపాలెం, జొన్నలగడ్డ రైతులు రూ. 400 కోట్లు నష్ట పోతున్నారని మంగళవారం ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులను అడ్డుకున్నారు. గత ప్రభుత్వం కావాలనే రోడ్డు మార్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు అలైన్మెంట్ మార్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్