ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.