నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆటో డ్రైవర్లు చూసుకోవాలని ట్రాఫిక్ సిఐ లోకనాథం అన్నారు. నరసరావుపేట పట్టణంలో ఆటో డ్రైవర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని కోరారు. అనంతరం ఆటో డ్రైవర్లకు పోలీసుల ఆధ్వర్యంలో యూనిఫాం పంపిణీ చేశారు.