నేడు పల్నాడుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

60చూసినవారు
నేడు పల్నాడుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
వనం-మనం పేరిట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నేడు పల్నాడులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాకాని పంచాయతీ పరిధిలోని జేఎన్టీయూలో మొక్కలు నాటనున్నారు. వీరి రాక నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 10: 30 గంటలకు పల్నాడుకు రానుండగా బహిరంగసభలోనూ ప్రసంగిస్తారు. అనంతరం 1: 15 గంటలకి తిరుగు పయనమవుతారు.

సంబంధిత పోస్ట్