వ్యవస్థలను ధ్వంసం చేసిన వ్యక్తి జగన్

61చూసినవారు
వ్యవస్థలను ధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం సత్తెనపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానము ప్రత్యేకతను కాపాడాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తిరుమల దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్