మాజీ మంత్రి అంబటి రాంబాబు అవినీతి, అక్రమ సంపాదన, దౌర్జన్యాలు, కక్షసాధింపు చర్యలపై అధికారులు న్యాయవిచారణ జరిపించాలని టీడీపీ అధికార ప్రతినిధి దివ్వెల శ్రీనివాసరావు శనివారం డిమాండ్ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో అక్రమ సంపాదన ద్వారా కూడబెట్టిన ఆస్తులను. నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు పంచాలన్నారు. అంబటి రాంబాబు నామినేటెడ్ పదవులు సైతం అమ్ముకొని సొమ్ము చేసుకొన్న తొలి ఎమ్మెల్యేగా మిగిలిపోయారని ఆరోపించారు.