సత్తెనపల్లి: ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు పునః పరిశీలించాలి

65చూసినవారు
సత్తెనపల్లి: ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు పునః పరిశీలించాలి
ఎస్సీ వర్గీ కరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ, సత్తెనపల్లి మండలంలోని మాలలు శుక్రవారం సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దళిత గిరిజనుల రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రక్రియను పునః పరిశీలించాలని కోరారు. 32 మంది రివ్యూ పిటిషన్ వేస్తే, సుప్రీంకోర్టు పరిశీలించేందుకు సిద్ధంగా లేదని విమర్శించారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజల పక్షాన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మాలలు కోరారు.

సంబంధిత పోస్ట్