వరదకు పండ్ల తోటలు మునక

58చూసినవారు
వరదకు పండ్ల తోటలు మునక
కొల్లిపర మండలం హనుమాన్ పాలెం గ్రామం తోపాటు ఇంకా పలు గ్రామాలలో వరద నీటిలో నిమ్మ తోటలు, అరటి తోటలు, ఇతర పండ్ల తోటలు సోమవారం నీట మునిగాయి. కృష్ణానదిలో భారీ ఎత్తున వరద ప్రవహిస్తుంది. దీంతో పరిధి దాటి పొలాల్లో ప్రవహిస్తూ ఉండటంతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిళ్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్