ఆర్టీసీ బస్ స్టాండ్ లో వ్యక్తి మృతి

81చూసినవారు
ఆర్టీసీ బస్ స్టాండ్ లో వ్యక్తి మృతి
వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం బస్టాండ్లో పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తుండగా ఓ వ్యక్తి ప్లాట్ పామ్ వద్ద చనిపోయి ఉండడాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని ఆర్టీసీ అధికారులకు తెలుపగా వారు మృతదేహాన్ని పోస్ట్ మర్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్