చిత్తూరులోని పలమనేరులో బైక్ కొనాలనుకుని షోరూమ్కు వచ్చిన ఓ అర్చకుడు తన వెంట తీసుకొచ్చిన చిల్లర నాణేల సంచులను చూపించి షోరూమ్ సిబ్బందిని ఖంగుతినిపించాడు. పలమనేరులోని టీవీఎస్ మోటార్ బైక్ షోరూంకు చిల్లర నాణేల సంచులతో చేరుకున్న బైరెడ్డిపల్లికి చెందిన అర్చకుడు అక్కడి సిబ్బంది ముక్కుపై వేలు వేసుకునేలా చేశాడు. జుపిటర్కు రూ. 1.30 లక్షల చిల్లర నాణేల సంచులను రాశులుగా పోశాడు. చేసేదేమిలేక సిబ్బంది 3 గంటల పాటు చిల్లర లెక్కించారు.