సీఎం జగన్ సన్నిహితుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు టీడీపీలో చేరారు. బసవరావుకు టీడీపీ నేత నారా లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగరి గ్రామీణ మండలం కురగల్లుకు చెందిన బసవరావు గతంలో జగన్కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి విశాఖపట్నం వరకు ఆయన 2 వేల కి.మీ పాదయాత్ర చేశారు. జగన్ విధానాలతో విభేదించి ఎస్సీ కమిషన్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.