ఏపీకి సీఎం ఎవరూ అన్నదానిపై మాజీ సీఎం
ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా హైదరాబాద్లోని
ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఎన్టీఆర్ ఆశీస్సులతో జూన్ 9న
జగన్ రెండోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆశీస్సులతో ఏపీలో మంచి పాలన జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.