ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుత
ో మృతి చెందాడు. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లి పరిధిలో జరిగింది. మార్గమధ్యలో ప్రయాణికుడు సొమ్మసిల్లి పడిపోయాడు. దాంతో అతడిని వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు కావలికి చెందిన రాజశేఖర్ రెడ్డిగా గుర్తించారు. ఈ మేరకు మృతుడి కుటుంబానికి సమాచారం అందజేశారు.