మా మద్దతు ఎప్పుడూ దౌత్యానికే: ప్రధాని మోదీ

57చూసినవారు
మా మద్దతు ఎప్పుడూ దౌత్యానికే: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ రష్యా వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ సదస్సులో బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్ దౌత్యం, చర్చలకు మద్దతిస్తుందని, యుద్ధానికి కాదని పునరుద్ఘాటించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా కఠిన పరిస్థితులు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి పలు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లడంలో బ్రిక్స్ సానుకూల పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్