AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అల్లూరి, ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. అటు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ధాటికి పలుచోట్ల రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుపానుగా మారనుండగా.. రాష్ట్రంపై దీని ప్రభావం ఉండదని వాతవరణ శాఖ వెల్లడించింది.