బీహార్లో విద్వేషం వ్యాప్తి చేసేందుకే అమిత్షా రాష్ట్రానికి వస్తారని, ఆయన అసత్యాలతో విషం వెదజల్లుతారని ఆర్జెడి నేత తేజస్వియాదవ్ విరుచుకుపడ్డారు. శుక్రవారం తేజస్వియాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అసత్యాలు, విద్వేష వైఖరిని బీహార్ ఎన్నటికీ అనుసరించదు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగానే బీహార్ అడుగులు వేస్తోంది. గత పదేండ్లుగా ప్రధాని మోడీ బీహార్ అభివృద్ధి కోసం ఏం చేశారు?’ అని ఆయన ప్రశ్నించారు.