భారీ వర్షాలు.. నీట మునిగిన పంటలు

77చూసినవారు
భారీ వర్షాలు.. నీట మునిగిన పంటలు
భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతోంది. ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, గుంటూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. కొవ్వాడ కాలువ ఉధృతితో నాలుగు మండలాల్లో సుమారు 8 వేల ఎకరాల ముంపునకు గురయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో 65 వేల ఎకరాలకు పైగా పంటలు నీట మునిగాయి. ఇందులో సుమారు 20 వేల ఎకరాల నారుమళ్లు ఉన్నట్లు సమాచారం. పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్