అన్నమయ్య జిల్లాలోని రాయచోటీలో
వైసీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ముందస్తు చర్యలలో భాగంగా
టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. రాయచోటి
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో
టీడీపీ,
వైసీపీ పార్టీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.