ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారించనుంది. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్కు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మధ్యంతర బెయిల్పై విచారణ సందర్భంగా.. ‘మీరు చర్చకు ఏదైనా జోడించాలనుకుంటే, మీరు దానిని జోడించవచ్చని ఎస్జీకీ సుప్రీం తెలిపింది.