విజయవాడలోని సితార సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోమ్ మినిస్టర్ అనిత అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు. అధికారులకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీస్ అధికారులు మంత్రికి వివరించారు.