భీమిలి సీటు గంటా శ్రీనివాసరావుకు కేటాయించడంతో
జనసేన నేతల్లో
తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండిపెండెంట్గా పంచకర్ల సందీప్ పోటీ చేయాలని
జనసేన కార్యకర్తలు ఒత్తిడి పెంచుతున్నారు. భీమిలిలో చందాలు వేసుకుని
జనసేన పార్టీని గెలిపించుకుంటామని చెబుతున్నారు. పదేళ్లు కష్టపడిన వారిని పవన్ మోసం చేశారని, భీమిలిలో టీడీపీకి సహకరించలేమన్నారు.