పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున తాను హింసను ప్రేరేపించినట్లుగా
వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని
టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఓటింగ్ అంతా
టీడీపీ కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. ఎస్పీకి, మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని కట్టుకథలు అల్లుతున్నారని తెలిపారు. ఒక కులం, వర్గానికి నన్ను పరిమితం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.