అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హిమాలయాలకు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. పార్టీ నేతలతో తన మనసులో మాట జగన్ పంచుకున్నట్లు తెలుస్తోంది. జగన్ చేసిన వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనిపించిందని నేతలతో జగన్ చెప్పినట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది. కానీ 40 శాతం ఓట్లు చూసి ఆగిపోయానని చెప్పినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.