AP: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ సముచితం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని యూపీఎస్సీకి ఆయన లేఖ రాశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు వాయిదా వేయాలని కోరారు. "సీఎంవోలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదు.. పునఃపరిశీలించాలి." అని లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.