ఏపీలో ఇవాళ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల్లో ఫెయిలయ్యాననే మనస్తాపంతో అర్చన అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామం అర్చన స్వస్థలం. చిత్తూరు జిల్లాలోనూ శాంతిపురానికి చెందిన గాయత్రి, రామకుప్పంకు చెందిన మిత్ర ఇదే కారణంతో పురుగుమందు తాగారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది.