మ‌ద్యం మ‌త్తులో యువ‌కుల వీరంగం.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడి

55చూసినవారు
మ‌ద్యం మ‌త్తులో యువ‌కుల వీరంగం.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడి
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక‌ మునిస్వామిపురం కాలనీలో కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ సోదరుడు వినయ్ పై వైసీపీకి చెందిన ఓ నాయకుడి ఇద్దరు కుమారులు తమ అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వినయ్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్