డాక్టర్ కుటుంబం మృతి కేసులో సంచలన నిజాలు

569చూసినవారు
డాక్టర్ కుటుంబం మృతి కేసులో సంచలన నిజాలు
విజయనగరంలో ఎముకల డాక్టర్ కుటుంబం అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. డాక్టర్ శ్రీనివాస్ గతేడాది సొంతంగా ఆస్పత్రి ప్రారంభించేందుకు రూ.3 కోట్లు వెచ్చించి భవనాన్ని లీజుకు తీసుకున్నాడు. ఆస్పత్రి ప్రారంభం కాకపోవడం, నమ్మిన స్నేహితులు మోసం చేయడంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. దాంతో భార్య ఉష, కుమార్తె శైలజ, కొడుకు శ్రీహాన్, తల్లి రమణమ్మను చంపి, తాను ఉరేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్