AP: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి లోకేశ్ శాసన మండలిలో తెలిపారు. గత ప్రభుత్వం పాత బకాయిల్ని 16 నెలల తర్వాత చెల్లించిందన్నారు. రూ.4,200 కోట్ల బకాయి పెట్టి వెళ్లిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలే అయ్యిందని, మొత్తం బకాయిలను త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు. ఈ విషయాన్ని గత చర్చలో స్పష్టంగా చెప్పామని, కానీ వైసీపీ సభ్యులు బాయ్కాట్ చేశారన్నారు.