ఉమ్మడి ఏపీని చంద్రబాబు ప్రథమ స్థానంలో నిలిపారని కేంద్రమంత్రి అమిత్ షా కొనియాడారు. విభజన తర్వాత కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్లారని తెలిపారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని సీఎం జగన్ అధోగతి పట్టించారని విమర్శించారు. 25కు 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లతో చంద్రబాబును సీఎంను చేయాలని ధర్మవరం సభలో విజ్ఞప్తి చేశారు.