అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సమీపంలోని పెన్నానది నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారికి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి పట్టణానికి చెందిన 25 మంది పెన్నా నది నుంచి ఇసుక రవాణా చేస్తున్నారని, ఇప్పటికైనా వారు ఇటువంటి పనిని మానుకోవాలని సూచించారు. పెన్నానదిలోకి టిప్పర్లు వెళితే సీజ్ చేస్తామని హెచ్చరించారు.