బద్వేల్ లో కబ్జాలపై డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తా: జనసేన

73చూసినవారు
బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు మితిమీరి కబ్జాలకు పాల్పడ్డారని, ఈ కబ్జాలకు స్థానిక అధికారులు కూడా తమ వంతు సహకరించారని జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా బద్వేల్ లో చోటు చేసుకున్న భూకబ్జాలపై వైసీపీ నాయకులతో పాటు, అధికారుల పేర్లను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

సంబంధిత పోస్ట్