రానున్న ఎన్నికల నేపథ్యంలో కొండాపురం మండలం వ్యాప్తంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా గురువారం కేంద్ర బలగాలతో కొండాపురం పోలీసులు కవాతు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు సీఐ వేణుగోపాల్, ఎస్సై యోగేంద్ర ఆధ్వర్యంలో కొండాపురం, చౌటిపల్లి గ్రామాలలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని సిఐ సూచించారు.