ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: సీ ఐ

77చూసినవారు
ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: సీ ఐ
జిల్లాతో పాటు జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎర్రగుంట్ల సీఐ నరేష్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ. దుకాణాదారులు, ఇంటి యాజమానులు సీసీ కెమెరాలను వినియోగిస్తే అనుమానితులను గుర్తించడంలో, నేర స్థలాలను పర్యవేక్షించడంతో పాటు సాక్ష్యాలను సేకరించడంలో ఇవి ప్రధాన భూమికను పోషిస్తాయన్నారు. ప్రతి ఒక్కరు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్