జమ్మలమడుగు మండల పరిధిలోని గూడెం చెరువు గ్రామంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు జమ్మలమడుగు శాసన సభ్యుడు మూలే సుధీర్ రెడ్డి పర్యటించనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అధికారులతో కలిసి పాల్గొంటారని, జమ్మలమడుగు మండల కన్వీనర్ శ్రీనివాస్లు, సర్పంచ్ నాగేశ్వరి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.