కమలాపురం నగరపంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర స్కూల్ దగ్గర, పలు వీధులలో కొత్త పైపులైన్ ను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే కొన్నిచోట్ల పైపులైన్లు పగిలి లీక్ అవుతున్నాయి. మున్సిపల్ అధికారులు లీకేజ్ అవుతున్న పైపులను వచ్చి చూస్తున్నారు కానీ మరమ్మతులు చేయడం లేదంటూ ప్రజల వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు బుధవారం కోరుతున్నారు.