కమలాపురం రైల్వే గేట్ మొరాయించడంతో ఇబ్బందులు పడ్డ ప్రజలు

79చూసినవారు
కమలాపురం నగర పంచాయతీలోని రైల్వే గేటు మొరాయించడంతో దాదాపు 45 నిమిషాల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రాత్రి కమలాపురం రైల్వే సమీపంలోని రైల్వే గేటు సాంకేతిక కారణాలతో పనిచేయకపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 45 నిమిషాల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తొందర్లో గేటు సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్