తప్పెట్ల లో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం... హాజరైన ఎమ్యెల్యే

85చూసినవారు
కడప జిల్లా వల్లూరు మండలం తప్పెట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో విగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్టాపనలు వైభవంగా జరిగాయి. ఆదివారం ఇదే ఆలయ ఆవరణలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కమలాపురం ఎమ్యెల్యే కృష్ణ చైతన్య రెడ్డి, మాజీ ఎమ్యెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు ఆలయాన్ని సందర్శించి సీతారాముల దర్శనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్