తోటపల్లి: ఆందోళనలో రైతులు

69చూసినవారు
తోటపల్లి: ఆందోళనలో రైతులు
తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని కుడి కాలువకు శుక్రవారం మూడు చోట్ల గండ్లు పడ్డాయి. మరుపెంట, గొట్టివలస, సాంబన్నవలస వద్ద కాలువలకు గండ్లు పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం తెలుసుకున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ వి. గౌరునాయుడు, సిబ్బంది మాధవరావు గండ్లు పండిన ప్రాంతాలను పరిశీలించారు. ఇప్పటికైనా కాలువల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్