ప్రజా వేదిక విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

53చూసినవారు
ప్రజా వేదిక విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మదనపల్లి నియోజకవర్గంలో ప్రజా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. 21న మదనపల్లి పట్టణంలోని మాలిక్ పంక్షన్ హాల్, 22న మదనపల్లి రూరల్, 24న నిమ్మనపల్లి మండలం, 26న రామసముద్రం మండలంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా ప్రజావేదికలో అర్జీలు సమర్పించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్