మైదుకూరు పట్టణంలోని నాలుగు ప్రధాన రోడ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ హైవే, రోడ్లు భవనాల శాఖ ఆధీనంలో ఉండడంతో బ్రిడ్జిలు, రోడ్లు గుంతల మయంతో ప్రజలు ప్రమాదంలో ఉన్నారని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ అన్నారు. శుక్రవారం బద్వేల్ రోడ్డులోని మార్కెట్ సర్కిల్ సహకార బ్యాంక్ దగ్గర ఉన్న దెబ్బతిన్న బ్రిడ్జిని నాయకులు కె. రామ్మోహన్, దశ రెడ్డి సుబ్బరాయుడు, వెంకటేష్ పరిశీలించారు.