తాగునీరు సమస్య తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు

85చూసినవారు
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం, యాపరాల పల్లె, గొల్లపల్లి ప్రాంతాలలో వారం రోజుల నుండి తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. సోమవారం త్రాగునీరు బోర్లు చెడిపోవడంతో, పనులన్నీ మానుకొని పంట పొలాల్లో ఉన్న బోర్ల వైపు నీటి కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరు రిపేర్ చేయించే వరకు మున్సిపాలిటీ నుండి ట్యాంకర్ల ద్వారా పల్లె ప్రాంతాలకు త్రాగునీరు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్